Movie News

ఏడుస్తూ మేనేజర్‌కు ఫోన్ చేసిన సమంత

సమంత ఇప్పుడు జస్ట్ సినిమా హీరోయిన్ కాదు. వెబ్ సిరీస్ స్పెషలిస్ట్. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో అదరగొట్టిన సామ్.. తాజాగా ‘సిటాడెల్’లో లీడ్ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్‌కు ఈ రకమైన మేకోవర్ ఇచ్చిన ఘనత తెలుగువారైన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్-డీకేలకే చెందుతుంది.

‘సిటాడెల్’ కోసం సమంత అందుబాటులోకి రాని స్థితిలో ఆమె కోసమే వెయిట్ చేసి మరీ ఈ సిరీస్ తీశారు. తనకు అంత విలువ ఇచ్చిన దర్శకుల గురించి ఒకప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నట్లు సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వాళ్ల శైలి తనకు నచ్చక ఒక దశలో తన మేనేజర్‌‌కు ఫోన్ చేసి ఏడ్చినట్లు సమంత గుర్తు చేసుకుంది.

“రాజ్-డీకేలతో పని చేయడం కంటే తెలుగు, తమిళ సినిమాల్లో వర్క్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా నేను నటించిన సినిమాల్లో రోజుకు రెండు లేదా మూడు సీన్స్ తీస్తారు. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం పని చేసినపుడు రాజీ పాత్రకు సంబంధించిన కొన్ని కీ సీన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ మొదటి షెడ్యూల్లోనే తీసేశారు. అది చాలా కష్టమనిపించింది. వాళ్ల శైలికి అలవాటుపడలేకపోయాను. రెండు రోజుల తర్వాత నా మేనేజర్‌కు ఫోన్ చేసి నా వల్ల కావట్లేదు, ఇంటికి వచ్చేస్తానని ఏడ్చాను. కానీ తర్వాత నెమ్మదిగా వాళ్ల శైలికి అలవాటు పడ్డాను” అని సమంత తెలిపింది.

ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్-డీకే మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్-2 చేస్తున్నపుడు సమంత వ్యక్తిగతంలో చాలా ఎమోషన్లతో ఇబ్బంది పడుతున్నారని తమకు తెలియదని అన్నారు. చెన్నైలో రెండు రోజుల షూట్ అవ్వగానే షూట్ అయిపోయిందా లేదా అని అడిగిందని.. అయిపోయిందని చెప్పగానే చిన్న పిల్లలాగే ఏడ్చేసిందని.. ఆమెను తాము చాలా కష్టపెడుతున్నామని అర్థమైందని చెప్పారు.

This post was last modified on November 11, 2024 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

3 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

10 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

10 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

10 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

12 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

13 hours ago