రేపు విడుదల కాబోతున్న ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య ఏదో మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడకుండా కిరణ్ అబ్బవరంని తానెంత ఇష్టపడతాడో చెప్పడం ద్వారా అందరి అభిమానులను ఆకట్టుకున్నాడు. కిరణ్ బాల్యం, చిన్నప్పుడు అతని తల్లి పడిన కష్టాలు, ఇద్దరు పిల్లలు చదువుకోవాలనే తపనతో కువైట్ వెళ్ళిపోయి అక్కడి నించి కుటుంబాన్ని పోషించడం లాంటివి విని కళ్లనీళ్లు పెట్టుకున్నంత పనైందని, ఇంతటి వ్యథ ఉన్న కిరణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయికి చేరుకోవాలంటూ ప్రోత్సహించడం నచ్చింది.
ప్రీమియర్లకు సిద్ధపడ్డ ‘క’కు చైతు ప్రసంగం మంచి బూస్ట్ గా మారబోతోంది. కిరణ్ అబ్బవరంని వ్యక్తిగతంగా తాను ఎంత ఇష్టపడతానో చెప్పిన నాగ చైతన్య ట్రోలింగ్ గురించి అసలు పట్టించుకోవద్దంటూ, చేతిలో మొబైల్ తప్ప ఇంకే పని లేని వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారని చెప్పడం ధైర్యాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా ఇంట్రోవర్ట్ అయిన తాను కిరణ్ తో మాత్రం త్వరగా కలిసిపోయానని, అతని జర్నీకి నెంబర్ వన్ ఫ్యాన్ అంటూ కితాబు ఇవ్వడం ఫ్యాన్స్ కిక్ ని పెంచింది. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘క’ వేడుకలో చూసినంత ఎమోషన్ గతంలో కిరణ్ ఏ సినిమాకు లేదన్నది వాస్తవం.
మొత్తానికి కిరణ్, చైతుల స్నేహం ‘క’కు ఉపయోగపడటం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుజీత్ – సందీప్ జంట దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ మీద టీమ్ నమ్మకం మాములుగా లేదు. తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్లాష్ కు సిద్ధపడింది. ఇవాళ అర్ధరాత్రి లోపే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దాని ప్రభావం రేపు ఓపెనింగ్స్ మీద ఉంటుంది. పాజిటివ్ అయితే మాత్రం దీపావళి సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ మంచి వసూళ్లకు గ్యారెంటీ ఇస్తుంది. ఏడాదిన్నర సమయం దీని కోసమే వెచ్చించిన కిరణ్ అబ్బవరం నిన్న జరిగిన ఈవెంట్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి మద్దతు తెచ్చేసుకున్నాడు.
This post was last modified on October 30, 2024 11:18 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…