రేపు విడుదల కాబోతున్న ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య ఏదో మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడకుండా కిరణ్ అబ్బవరంని తానెంత ఇష్టపడతాడో చెప్పడం ద్వారా అందరి అభిమానులను ఆకట్టుకున్నాడు. కిరణ్ బాల్యం, చిన్నప్పుడు అతని తల్లి పడిన కష్టాలు, ఇద్దరు పిల్లలు చదువుకోవాలనే తపనతో కువైట్ వెళ్ళిపోయి అక్కడి నించి కుటుంబాన్ని పోషించడం లాంటివి విని కళ్లనీళ్లు పెట్టుకున్నంత పనైందని, ఇంతటి వ్యథ ఉన్న కిరణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయికి చేరుకోవాలంటూ ప్రోత్సహించడం నచ్చింది.
ప్రీమియర్లకు సిద్ధపడ్డ ‘క’కు చైతు ప్రసంగం మంచి బూస్ట్ గా మారబోతోంది. కిరణ్ అబ్బవరంని వ్యక్తిగతంగా తాను ఎంత ఇష్టపడతానో చెప్పిన నాగ చైతన్య ట్రోలింగ్ గురించి అసలు పట్టించుకోవద్దంటూ, చేతిలో మొబైల్ తప్ప ఇంకే పని లేని వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారని చెప్పడం ధైర్యాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా ఇంట్రోవర్ట్ అయిన తాను కిరణ్ తో మాత్రం త్వరగా కలిసిపోయానని, అతని జర్నీకి నెంబర్ వన్ ఫ్యాన్ అంటూ కితాబు ఇవ్వడం ఫ్యాన్స్ కిక్ ని పెంచింది. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘క’ వేడుకలో చూసినంత ఎమోషన్ గతంలో కిరణ్ ఏ సినిమాకు లేదన్నది వాస్తవం.
మొత్తానికి కిరణ్, చైతుల స్నేహం ‘క’కు ఉపయోగపడటం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుజీత్ – సందీప్ జంట దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ మీద టీమ్ నమ్మకం మాములుగా లేదు. తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్లాష్ కు సిద్ధపడింది. ఇవాళ అర్ధరాత్రి లోపే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దాని ప్రభావం రేపు ఓపెనింగ్స్ మీద ఉంటుంది. పాజిటివ్ అయితే మాత్రం దీపావళి సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ మంచి వసూళ్లకు గ్యారెంటీ ఇస్తుంది. ఏడాదిన్నర సమయం దీని కోసమే వెచ్చించిన కిరణ్ అబ్బవరం నిన్న జరిగిన ఈవెంట్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి మద్దతు తెచ్చేసుకున్నాడు.
This post was last modified on October 30, 2024 11:18 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…