మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రం వాయిదాకు పడిపోయింది. సంక్రాంతి రిలీజ్ అయితే.. దీని తర్వాత ఆయన చేసే సినిమా గురించి ఈపాటికే క్లారిటీ వచ్చేసేది. ఐతే చిరు నుంచి ఏ సమాచారం లేకపోయినా.. ఆయనతో సినిమా చేయబోతున్న విషయాన్ని రైటర్ బీవీఎస్ రవి ధ్రువీకరించాడు.
విశ్వంభర తర్వాత చిరు తమ సినిమానే చేస్తాడని రవి ప్రకటించాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. చిరుతో సినిమాను ఈ సమయంలోనే కన్ఫమ్ చేశారు. ఐతే రవికి దర్శకుడిగా కూడా అనుభవం ఉన్నప్పటికీ.. చిరుతో చేయబోయే చిత్రానికి అతను రచయిత మాత్రమే చిరుతో తాము చేయబోయే సినిమా కథ ఎలా ఉంటుందో కూడా హింట్ ఇచ్చాడు రవి.
విశ్వంభర పూర్తయిన తర్వాత చిరంజీవి గారితో మేం సినిమా చేస్తాం. ఆయన డ్యాన్సులు, ఫైట్లను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడ్డ కథాంశాలతో సినిమాలు చేస్తే వాటినీ ఆదరించారు. అగ్ర హీరోలు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తే వాటి గురించి ఎక్కువమంది జనాలకు తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నాం అని బీవీఎస్ రవి తెలిపాడు. రవి పని చేస్తున్నది తమిళ దర్శకుడు మోహన్ రాజా సినిమాకు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంతకుముందు చిరుతో గాడ్ ఫాదర్ మూవీ తీసిన మోహన్ రాజా.. చిరుతో మరో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించాడు. చిరు కూడా సుముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కథ తయారవుతోంది. చిరు అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను మొదలుపెడతారు. చిరు తనయురాలు సుష్మిత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. విశ్వంభర కంటే ముందే ఆమె బేనర్లో చిరు సినిమా అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
This post was last modified on %s = human-readable time difference 10:14 am
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో ముప్పై ఎనిమిది రోజుల్లో ఉంది. ఐటెం సాంగ్ షూటింగ్ తప్ప అల్లు…
కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్…
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజకీయ రచ్చగా మారిన విషయం…
టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో నేతలు కుత కుతలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం తెరమీదికి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ తెరమరుగు…
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు…