మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రం వాయిదాకు పడిపోయింది. సంక్రాంతి రిలీజ్ అయితే.. దీని తర్వాత ఆయన చేసే సినిమా గురించి ఈపాటికే క్లారిటీ వచ్చేసేది. ఐతే చిరు నుంచి ఏ సమాచారం లేకపోయినా.. ఆయనతో సినిమా చేయబోతున్న విషయాన్ని రైటర్ బీవీఎస్ రవి ధ్రువీకరించాడు.
విశ్వంభర తర్వాత చిరు తమ సినిమానే చేస్తాడని రవి ప్రకటించాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. చిరుతో సినిమాను ఈ సమయంలోనే కన్ఫమ్ చేశారు. ఐతే రవికి దర్శకుడిగా కూడా అనుభవం ఉన్నప్పటికీ.. చిరుతో చేయబోయే చిత్రానికి అతను రచయిత మాత్రమే చిరుతో తాము చేయబోయే సినిమా కథ ఎలా ఉంటుందో కూడా హింట్ ఇచ్చాడు రవి.
విశ్వంభర పూర్తయిన తర్వాత చిరంజీవి గారితో మేం సినిమా చేస్తాం. ఆయన డ్యాన్సులు, ఫైట్లను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడ్డ కథాంశాలతో సినిమాలు చేస్తే వాటినీ ఆదరించారు. అగ్ర హీరోలు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తే వాటి గురించి ఎక్కువమంది జనాలకు తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నాం అని బీవీఎస్ రవి తెలిపాడు. రవి పని చేస్తున్నది తమిళ దర్శకుడు మోహన్ రాజా సినిమాకు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంతకుముందు చిరుతో గాడ్ ఫాదర్ మూవీ తీసిన మోహన్ రాజా.. చిరుతో మరో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించాడు. చిరు కూడా సుముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కథ తయారవుతోంది. చిరు అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను మొదలుపెడతారు. చిరు తనయురాలు సుష్మిత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. విశ్వంభర కంటే ముందే ఆమె బేనర్లో చిరు సినిమా అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
This post was last modified on October 28, 2024 10:14 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…