మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రం వాయిదాకు పడిపోయింది. సంక్రాంతి రిలీజ్ అయితే.. దీని తర్వాత ఆయన చేసే సినిమా గురించి ఈపాటికే క్లారిటీ వచ్చేసేది. ఐతే చిరు నుంచి ఏ సమాచారం లేకపోయినా.. ఆయనతో సినిమా చేయబోతున్న విషయాన్ని రైటర్ బీవీఎస్ రవి ధ్రువీకరించాడు.
విశ్వంభర తర్వాత చిరు తమ సినిమానే చేస్తాడని రవి ప్రకటించాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. చిరుతో సినిమాను ఈ సమయంలోనే కన్ఫమ్ చేశారు. ఐతే రవికి దర్శకుడిగా కూడా అనుభవం ఉన్నప్పటికీ.. చిరుతో చేయబోయే చిత్రానికి అతను రచయిత మాత్రమే చిరుతో తాము చేయబోయే సినిమా కథ ఎలా ఉంటుందో కూడా హింట్ ఇచ్చాడు రవి.
విశ్వంభర పూర్తయిన తర్వాత చిరంజీవి గారితో మేం సినిమా చేస్తాం. ఆయన డ్యాన్సులు, ఫైట్లను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడ్డ కథాంశాలతో సినిమాలు చేస్తే వాటినీ ఆదరించారు. అగ్ర హీరోలు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తే వాటి గురించి ఎక్కువమంది జనాలకు తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నాం అని బీవీఎస్ రవి తెలిపాడు. రవి పని చేస్తున్నది తమిళ దర్శకుడు మోహన్ రాజా సినిమాకు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంతకుముందు చిరుతో గాడ్ ఫాదర్ మూవీ తీసిన మోహన్ రాజా.. చిరుతో మరో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించాడు. చిరు కూడా సుముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కథ తయారవుతోంది. చిరు అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను మొదలుపెడతారు. చిరు తనయురాలు సుష్మిత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. విశ్వంభర కంటే ముందే ఆమె బేనర్లో చిరు సినిమా అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
This post was last modified on October 28, 2024 10:14 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…