Movie News

అనుష్క మలయాళ భూతం.. సౌండ్ లేకుండానే..

అనుష్క శెట్టి గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నా ఆడియెన్స్ మాత్రం ఆమె నుంచి అంతకుమించి అనేలా బిగ్ కంటెంట్ రావాలని కోరుకుంటున్నారు. అయితే అనుష్క కూడా ఏది పడితే అది చేయకుండా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగాలు తీసుకుంటోంది. ప్రస్తుతం క్రిష్ తో ఘాటీ అనే సినిమా చేస్తోంది. ఇది అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య అనుష్క మలయాళంలో తన తొలి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ కొత్త చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినప్పటికీ అప్డేట్స్ పెద్దగా లేకపోవడంతో ఫోకస్ లోకి రావడం లేదు. చాలా సైలెంట్ గా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘కథనర్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా హరర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించగా, అనుష్క ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘కథనర్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మలయాళ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఉంది. సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం, రెండు భాగాలుగా వస్తుందట.

9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనర్ జీవితం ఆధారంగా తెరకెక్కించబడినట్లు సమాచారం. ఆత్మలు, భూతం అనే ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఇందులో గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి పెద్ద సినిమాలకు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండాలి. కానీ మలయాళం వాతావరణంకు తగ్గట్లే సైలెంట్ గా పని పూర్తి చేస్తున్నారు. మరి అనుష్క స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు ఎలాంటి హైప్ తీసుకు వస్తుందో చూడాలి.

This post was last modified on October 19, 2024 1:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

11 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago