సరిగ్గా తగలాలే కానీ ఒక చిన్న వీడియో క్లిప్ సినిమాకు ఎంత పెద్ద ప్రమోషన్ తీసుకొస్తుందో సోషల్ మీడియా మరోసారి ఋజువు చేస్తోంది. రియా ఎవరు పేరుతో జరుగుతున్న ట్రెండింగ్ ఏకంగా సెలబ్రిటీలను అందులో భాగమయ్యేలా చేస్తోంది. తాజాగా నాగబాబు, నీహారిక సైతం ఇందులో పాల్గొనడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన మత్తు వదలరా 2లో ఒక సన్నివేశం తాలూకు క్లిప్ ఇది. విలన్ అజయ్ ని కమెడియన్ సత్య రియా ఎవరు అని అడగటంతో మొదలయ్యే సంభాషణ చివరికి ఎటూ తేలకుండా హిలేరియస్ గా ముగుస్తుంది.
దీన్నే లెక్కలేనంత నెటిజెన్లు షేర్ చేసుకోవడంతో రీచ్ మిలియన్లలో వెళ్ళిపోతోంది. నిన్న పొట్టెల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ ఎవరెవరో రియా ఎవరూ అంటూ తనకు ఫోన్ చేస్తున్నారని, మీమ్స్ లో ఎవరూ పట్టించుకోనని తనకు దేవర, మత్తు వదలరా 2 తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదని సంతోషం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ హ్యాండిల్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోని పెట్టి రియా ఎవరూ అంటూ ట్వీట్ చేయడం దాక వెళ్లిందంటే సత్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదని అర్థమైపోతోందిగా.
ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఊహించని స్థాయిలో దక్కిన ఫ్రీ ప్రమోషన్ నెట్ ఫ్లిక్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కోసారి ఇంత పబ్లిసిటీ దక్కదు. అలాంటిది కేవలం రియా అనే పేరు మీద ఇంత ప్రచారం దక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా 2 థియేటర్లో డీసెంట్ సక్సెస్ అందుకోగా ఓటిటిలో మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సత్యకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే డేట్లు అంత సులభంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు ఇంకో రెండేళ్ల దాకా ఖాళీ లేనంత రేంజ్ కు వెళ్ళిపోతున్నాడు.
This post was last modified on October 19, 2024 10:20 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…