మలయాళ బ్లాక్బస్టర్ మూవీ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. తెలుగులోకి కూడా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీనే ఇచ్చింది. ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’.. ఇలా ఇక్కడ ఆమె కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందం, అభినయం రెండూ ఉన్న అనుపమ చాలా పెద్ద స్థాయికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి.
ఒక దశలో ‘రంగస్థలం’ లాంటి పెద్ద సినిమాను చేజిక్కించుకుని టాప్ స్టార్ అయ్యేలా కనిపించింది అనుపమ. ఐతే ఈ సినిమా అవకాశం చేజారడంతోనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ కూడా మొదలైంది. తన కెరీర్కు కలిసొచ్చే సరైన సినిమాలు ఎంచుకోకపోవడం, వరుస ఫ్లాపులు అనుపమను రేసులో వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు తెలుగులోనే అత్యంత బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నట్లు కూడా ఎవరికీ అనిపించడం లేదు. గత ఏడాది చేసిన ‘రాక్షసుడు’ బాగా ఆడినా సరే.. ఆమె కెరీర్కు అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు.
లేక లేక ఆమెకు ‘కార్తికేయ-2’లో అవకాశం వచ్చినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. మేక్ ఆర్ బ్రేక్ ఛాన్స్ లాగా దీన్ని భావించారు. ఎందుకంటే చందూ మొండేటి, నిఖిల్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్లో కథానాయికకు కూడా మంచి రోలే ఉంటుందని భావించారు. కానీ అనుపమ చేతిలో ఉన్న ఈ ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు చేజారినట్లు వార్తలొస్తున్నాయి.
అనుపమ స్థానంలోకి ‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంక అరుల్ మోహన్ను తీసుకున్నారట. ఈ సినిమాకు కథానాయికగా ఫ్రెష్ ఫేస్ అయితేనే బాగుంటుందని చందూ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అనుపమ ఒకప్పటితో పోలిస్తే లుక్ పరంగా కూడా కొంచెం తేడాగానే కనిపిస్తోంది. ఇటీవలే ఆమె చేసిన ఒక ట్రెడిషనల్ ఫొటోలో బాగా సన్నబడి, ముఖంలో కాంతి కోల్పోయి ఏమంత ఆకర్షణీయంగా కనిపించలేదు అనుపమ. అసలే కెరీర్ అంత ఊపులో లేదు. పైగా లుక్ కూడా డల్ అయ్యేసరికి అవకాశం చేజారిందేమో అనిపిస్తోంది. ఈ వార్త ఖరారైతే మాత్రం తెలుగులో అనుపమ కెరీర్ క్లోజ్ అయిందనుకోవచ్చు.
This post was last modified on October 1, 2020 12:29 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…