మలయాళ బ్లాక్బస్టర్ మూవీ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. తెలుగులోకి కూడా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీనే ఇచ్చింది. ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’.. ఇలా ఇక్కడ ఆమె కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందం, అభినయం రెండూ ఉన్న అనుపమ చాలా పెద్ద స్థాయికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి.
ఒక దశలో ‘రంగస్థలం’ లాంటి పెద్ద సినిమాను చేజిక్కించుకుని టాప్ స్టార్ అయ్యేలా కనిపించింది అనుపమ. ఐతే ఈ సినిమా అవకాశం చేజారడంతోనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ కూడా మొదలైంది. తన కెరీర్కు కలిసొచ్చే సరైన సినిమాలు ఎంచుకోకపోవడం, వరుస ఫ్లాపులు అనుపమను రేసులో వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు తెలుగులోనే అత్యంత బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నట్లు కూడా ఎవరికీ అనిపించడం లేదు. గత ఏడాది చేసిన ‘రాక్షసుడు’ బాగా ఆడినా సరే.. ఆమె కెరీర్కు అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు.
లేక లేక ఆమెకు ‘కార్తికేయ-2’లో అవకాశం వచ్చినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. మేక్ ఆర్ బ్రేక్ ఛాన్స్ లాగా దీన్ని భావించారు. ఎందుకంటే చందూ మొండేటి, నిఖిల్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్లో కథానాయికకు కూడా మంచి రోలే ఉంటుందని భావించారు. కానీ అనుపమ చేతిలో ఉన్న ఈ ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు చేజారినట్లు వార్తలొస్తున్నాయి.
అనుపమ స్థానంలోకి ‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంక అరుల్ మోహన్ను తీసుకున్నారట. ఈ సినిమాకు కథానాయికగా ఫ్రెష్ ఫేస్ అయితేనే బాగుంటుందని చందూ ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అనుపమ ఒకప్పటితో పోలిస్తే లుక్ పరంగా కూడా కొంచెం తేడాగానే కనిపిస్తోంది. ఇటీవలే ఆమె చేసిన ఒక ట్రెడిషనల్ ఫొటోలో బాగా సన్నబడి, ముఖంలో కాంతి కోల్పోయి ఏమంత ఆకర్షణీయంగా కనిపించలేదు అనుపమ. అసలే కెరీర్ అంత ఊపులో లేదు. పైగా లుక్ కూడా డల్ అయ్యేసరికి అవకాశం చేజారిందేమో అనిపిస్తోంది. ఈ వార్త ఖరారైతే మాత్రం తెలుగులో అనుపమ కెరీర్ క్లోజ్ అయిందనుకోవచ్చు.
This post was last modified on October 1, 2020 12:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…