Movie News

బాహుబలి 3 నిజంగా జరిగే పనేనా

కంగువ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 ఉంటుందని, గత వారమే దాని ప్రొడ్యూసర్లతో మాట్లాడానని కానీ చాలా టైం అయితే పడుతుందని చెప్పిన మాటలు అభిమానుల మధ్య విపరీతంగా వైరలవుతున్నాయి. గతంలో రాజమౌళినే ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉండొచ్చని మాటవరసకు అని దాటవేశారు తప్పించి నిర్ధారణగా చెప్పలేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాహుబలి 3కి ఏ మేరకు తెరకెక్కే సూచనలున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు 29 కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి సెట్స్ కు వెళ్లబోతోంది.

ఎంతలేదన్నా దీని మీద పెడుతున్న బడ్జెట్ కి రెండేళ్లకు పైగానే పడుతుంది. ఇంకో ఏడాది ఎక్స్ ట్రా అయినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. బాహుబలి మీద అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ ఇంత గ్యాప్ తో మూడో భాగమంటూ కొనసాగింపు తీసుకొస్తే వర్కౌటవుతుందా అంటే అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా ఉంటుంది. కానీ రాజమౌళి, ప్రభాస్ లు దీని పట్ల ఎంత మాత్రం సీరియస్ గా ఉన్నారనేది కీలకం. ఎందుకంటే రానా, అడివి శేష్ పాత్రలు చనిపోయాయి. కొత్త విలన్లను పెట్టాలి. అనుష్కను ఓల్డ్ గెటప్ లోనే కొనసాగించాలి.

ఇవన్నీ కథ పరంగా సవాళ్లు విసిరే అంశాలే. అసలే రాజమౌళి భవిష్యత్తులో మహాభారతం తీసే ఆలోచనలో ఉన్నారు. నిజంగా పూనుకుంటే దానికి ఎంత కాలం ఖర్చవుతుందో ఊహకందదు. అయినా జ్ఞానవేల్ చెప్పిన ప్రకారం చూస్తే ది రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఉంటాయి. అవయ్యాక బాహుబలి 3 అంటున్నారు. అంటే ఎంతలేదన్నా 2030 అయ్యేలా ఉంది. ప్రభాస్ అప్పటికంతా ఎన్ని కొత్త సినిమాలు చేస్తాడో, ఎవరెవరికి కమిట్ మెంట్లు ఇస్తాడో చెప్పలేంగా. వినడానికి బాగానే ఉంది కానీ బాహుబలి 3 ది ఎక్స్ టెన్షన్ ఇప్పట్లో జరిగే పనైతే కాదు.

This post was last modified on October 17, 2024 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago