కంగువ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 ఉంటుందని, గత వారమే దాని ప్రొడ్యూసర్లతో మాట్లాడానని కానీ చాలా టైం అయితే పడుతుందని చెప్పిన మాటలు అభిమానుల మధ్య విపరీతంగా వైరలవుతున్నాయి. గతంలో రాజమౌళినే ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉండొచ్చని మాటవరసకు అని దాటవేశారు తప్పించి నిర్ధారణగా చెప్పలేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాహుబలి 3కి ఏ మేరకు తెరకెక్కే సూచనలున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు 29 కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి సెట్స్ కు వెళ్లబోతోంది.
ఎంతలేదన్నా దీని మీద పెడుతున్న బడ్జెట్ కి రెండేళ్లకు పైగానే పడుతుంది. ఇంకో ఏడాది ఎక్స్ ట్రా అయినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. బాహుబలి మీద అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ ఇంత గ్యాప్ తో మూడో భాగమంటూ కొనసాగింపు తీసుకొస్తే వర్కౌటవుతుందా అంటే అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా ఉంటుంది. కానీ రాజమౌళి, ప్రభాస్ లు దీని పట్ల ఎంత మాత్రం సీరియస్ గా ఉన్నారనేది కీలకం. ఎందుకంటే రానా, అడివి శేష్ పాత్రలు చనిపోయాయి. కొత్త విలన్లను పెట్టాలి. అనుష్కను ఓల్డ్ గెటప్ లోనే కొనసాగించాలి.
ఇవన్నీ కథ పరంగా సవాళ్లు విసిరే అంశాలే. అసలే రాజమౌళి భవిష్యత్తులో మహాభారతం తీసే ఆలోచనలో ఉన్నారు. నిజంగా పూనుకుంటే దానికి ఎంత కాలం ఖర్చవుతుందో ఊహకందదు. అయినా జ్ఞానవేల్ చెప్పిన ప్రకారం చూస్తే ది రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఉంటాయి. అవయ్యాక బాహుబలి 3 అంటున్నారు. అంటే ఎంతలేదన్నా 2030 అయ్యేలా ఉంది. ప్రభాస్ అప్పటికంతా ఎన్ని కొత్త సినిమాలు చేస్తాడో, ఎవరెవరికి కమిట్ మెంట్లు ఇస్తాడో చెప్పలేంగా. వినడానికి బాగానే ఉంది కానీ బాహుబలి 3 ది ఎక్స్ టెన్షన్ ఇప్పట్లో జరిగే పనైతే కాదు.
This post was last modified on October 17, 2024 12:01 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…