తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే.
మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ నిరసనల్లో పాలుపంచుకున్న వైసీపీ కీలక నేతలు… రాధాకృష్ణపై బూతు దండకం అందుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.
వైసీపీ నేతలపై రాధాకృష్ణ తన కథనంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వాదించిన ఆ పార్టీ నేతలు తమ నిరసనల్లో రాధాకృష్ణపై అవే అనుచిత వ్యాఖ్యలు వినియోగించడం నిజంగానే విస్మయాన్ని కలుగజేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళలను కించపరచడం ఏ ఒక్కరికీ సరికాదనే చెప్పాలి. అయితే వారు మా ఆడవాళ్లను తిడితే… తాము మాత్రం చేతులు కట్టుకు కూర్చోవాలా? అన్న రీతి ఇప్పుడు మరింత ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాలి. వెరసి ఆయా కుటుంబాల్లోని మహిళలు అనవసరంగా బదనాం అయిపోతున్నారు.
ఏబీఎన్ ముందు ఆందోళనల్లో భాగంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనదైన శైలిలో బూతు పురాణం అందుకున్నారు. రాధాకృష్ణను పదే పదే పేరు పెట్టి పిలిచిన ఆయన… ఆంధ్రజ్యోతిని బూతు జ్యోతిగా అభివర్ణించారు. అంతటితో ఆగని జోగి… దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రావాలని రాధాకృష్ణకు సవాల్ విసిరారు.
మరో అడుగు ముందుకేసీ రాధాకృష్ణను నీవు మగాడివైతే… అంటూ మనింత ఘాటు పదజాలాన్ని వినియోగించారు. తాము అధికారంలోకి వస్తే రాధాకృఫ్ణను పరుగెత్తించి కొడతామని కూడా ఆయన వార్నింగిచ్చారు. ఇప్పుడు పోలీసు భద్రత మధ్య క్షేమంగా ఉన్నా.. పోలీసులు ఎప్పుడూ సెక్యూరిటీ ఇవ్వరన్న విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… రాధాకృష్ణ తన కథనంలో ఏపీ రాజకీయాలను రాస్తే… వైసీపీ మాత్రం ఏపీని వదిలేసి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసనకు దిగడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…