తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే.
మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ నిరసనల్లో పాలుపంచుకున్న వైసీపీ కీలక నేతలు… రాధాకృష్ణపై బూతు దండకం అందుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.
వైసీపీ నేతలపై రాధాకృష్ణ తన కథనంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వాదించిన ఆ పార్టీ నేతలు తమ నిరసనల్లో రాధాకృష్ణపై అవే అనుచిత వ్యాఖ్యలు వినియోగించడం నిజంగానే విస్మయాన్ని కలుగజేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళలను కించపరచడం ఏ ఒక్కరికీ సరికాదనే చెప్పాలి. అయితే వారు మా ఆడవాళ్లను తిడితే… తాము మాత్రం చేతులు కట్టుకు కూర్చోవాలా? అన్న రీతి ఇప్పుడు మరింత ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాలి. వెరసి ఆయా కుటుంబాల్లోని మహిళలు అనవసరంగా బదనాం అయిపోతున్నారు.
ఏబీఎన్ ముందు ఆందోళనల్లో భాగంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనదైన శైలిలో బూతు పురాణం అందుకున్నారు. రాధాకృష్ణను పదే పదే పేరు పెట్టి పిలిచిన ఆయన… ఆంధ్రజ్యోతిని బూతు జ్యోతిగా అభివర్ణించారు. అంతటితో ఆగని జోగి… దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రావాలని రాధాకృష్ణకు సవాల్ విసిరారు.
మరో అడుగు ముందుకేసీ రాధాకృష్ణను నీవు మగాడివైతే… అంటూ మనింత ఘాటు పదజాలాన్ని వినియోగించారు. తాము అధికారంలోకి వస్తే రాధాకృఫ్ణను పరుగెత్తించి కొడతామని కూడా ఆయన వార్నింగిచ్చారు. ఇప్పుడు పోలీసు భద్రత మధ్య క్షేమంగా ఉన్నా.. పోలీసులు ఎప్పుడూ సెక్యూరిటీ ఇవ్వరన్న విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… రాధాకృష్ణ తన కథనంలో ఏపీ రాజకీయాలను రాస్తే… వైసీపీ మాత్రం ఏపీని వదిలేసి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసనకు దిగడం గమనార్హం.
This post was last modified on April 7, 2026 12:28 pm
అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…
రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…
భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాల్లో ప్రయత్నించినా.. విద్యార్థుల ఆందోళనలను నిలువరించలేకపోతోంది. ఇప్పటికే బల ప్రయోగం చేయడంతో ఇది తీవ్ర వివాదానికి…