Political News

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు.

అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలుకు దీటుగా జవాబివ్వాలని బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబు పాలనపై ఫీడ్ బ్యాక్ బాగుందని కితాబిచ్చారు.

పెట్టుబడులు ఎక్కువగా ఏపీకి వెళుతున్నాయని, అభివృద్ధికి ఇది సూచిక అని మోదీ ప్రశంసించారు. ఇక, తెలంగాణలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట.

జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు చురుగ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారట. ఏపీ, తెలంగాణతో పాటు అండమాన్ కు చెందిన బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారట. మరి, మోదీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నా కౌంటర్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

This post was last modified on December 11, 2025 3:34 pm

Share

Recent Posts

టాక్సిక్ విధ్వంసం 191 నిమిషాలు ?

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…

12 minutes ago

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విద్యార్థుల సెగ‌.. కేంద్రం మౌనం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంటే.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి అంత‌టి పోస్టు. ఈ ప‌ద‌వికి అనేక మంది వ‌న్నె తెచ్చారు.…

52 minutes ago

‘వందేమాత‌రం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం

మ‌రో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…

56 minutes ago

పెనిమిటి కోసం తగ్గేదెలే అంటున్న రష్మిక

అన్ని అనుకున్న టైంకి జరిగి ఉంటే విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయ్యేది. అయితే ఇంకా…

1 hour ago

టికెట్ రేట్ల గోల లేకుంటే ఎంత బాగుందో

గత రెండు నెలలుగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. యునానిమస్ కాదు…

1 hour ago

వ‌రుణ యాగంపై బీఆర్ఎస్ సెటైర్లు.. రేవంత్ సందేహం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ సందేహం వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న‌.. స్వ‌యంగా వ‌ర్షాల కోసం వ‌రుణ యాగం నిర్వ‌హిస్తున్నామ‌ని…

4 hours ago