Political News

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు.

అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలుకు దీటుగా జవాబివ్వాలని బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబు పాలనపై ఫీడ్ బ్యాక్ బాగుందని కితాబిచ్చారు.

పెట్టుబడులు ఎక్కువగా ఏపీకి వెళుతున్నాయని, అభివృద్ధికి ఇది సూచిక అని మోదీ ప్రశంసించారు. ఇక, తెలంగాణలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట.

జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు చురుగ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారట. ఏపీ, తెలంగాణతో పాటు అండమాన్ కు చెందిన బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారట. మరి, మోదీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నా కౌంటర్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

This post was last modified on December 11, 2025 3:34 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganModi

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

2 hours ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

2 hours ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

3 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

3 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

3 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

3 hours ago