Political News

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు.

అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలుకు దీటుగా జవాబివ్వాలని బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబు పాలనపై ఫీడ్ బ్యాక్ బాగుందని కితాబిచ్చారు.

పెట్టుబడులు ఎక్కువగా ఏపీకి వెళుతున్నాయని, అభివృద్ధికి ఇది సూచిక అని మోదీ ప్రశంసించారు. ఇక, తెలంగాణలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట.

జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు చురుగ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారట. ఏపీ, తెలంగాణతో పాటు అండమాన్ కు చెందిన బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారట. మరి, మోదీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమన్నా కౌంటర్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Kumar

Recent Posts

అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…

21 minutes ago

15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం…

25 minutes ago

ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?

​ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…

52 minutes ago

భ్రమలో ఉన్న ఫ్లాప్ దర్శకుడు

తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…

1 hour ago

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

2 hours ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

2 hours ago