Movie News

సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డే..

ఆలూ లేదు చూలూ లేదు.. అన్నట్లే ఉంది సంక్రాంతి బెర్తుల కోసం పోటీ చూస్తుంటే. థియేటర్లు తెరుచుకోవడానికి ఈ నెలలో అనుమతులైతే ఇచ్చారు కానీ.. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పున:ప్రారంభం అయ్యాయి. అవి కూడా కొన్ని మల్టీప్లెక్స్ ఛైన్స్ మాత్రమే. అవి కూడా నామమాత్రంగా నడుస్తున్నాయి. మిగతా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో.. మామూలుగా నడుస్తాయో తెలయట్లేదు.

ఏదైనా సరే.. కరోనా ప్రభావం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మీదే ఆధారపడి ఉంది. ఐతే థియేటర్ల సంగతి ఎటూ తేలకుండానే టాలీవుడ్లో సంక్రాంతి పందేలు మాత్రం జోరుగా సాగిపోతున్నాయి. వరుసబెట్టి సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమాలను ప్రకటించేస్తున్నారు. ఆ మధ్య నితిన్ సినిమా ‘రంగ్ దె’ను సంక్రాంతి రేసులో నిలబెడుతున్నట్లు టీజర్లో ప్రకటించారు.

ఇక రెండు రోజుల కిందటే రానా దగ్గుబాటి సినిమా ‘అరణ్య’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు దసరా సందర్భంగా ఒకటికి రెండు సినిమాలు సంక్రాంతి విడుదలను ప్రకటించుకున్నాయి. అందులో ఒకటి రవితేజ సినిమా ‘క్రాక్’ కాగా.. ఇంకోటి రామ్ మూవీ ‘రెడ్’. ‘క్రాక్’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ‘రెడ్’ ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. ‘అరణ్య’ సైతం ఎప్పుడో పూర్తయింది. ‘రంగ్ దె’ చివరి దశలో ఉంది.

ఒకే సీజన్లో నాలుగు సినిమాలంటే ఇక హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయాల్సిందే. వేరే సినిమాలకు అవకాశం లేనట్లే. వీటిని సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టమేమీ కాదు కానీ.. అప్పటికి థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయా లేదా అన్నదే సందేహంగా ఉంది. మరోవైపు కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ను సైతం సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సంక్రాంతి కంటే ముందే థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడిచి జనాలు ఒకప్పట్లా సినిమాలు చూడ్డానికి వస్తేనే ఈ సినిమాలన్నీ సంక్రాంతి రేసులో ఉంటాయన్నది స్పష్టం.

This post was last modified on October 25, 2020 2:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

17 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

40 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

49 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago