అన్నీ కుదిర్తే… చిరంజీవి వర్సెస్‍ బాలకృష్ణ!

చిరంజీవి వర్సెస్‍ బాలకృష్ణ బాక్సాఫీస్‍ వార్‍ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్‍ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్‍ సినిమాలయితే ఆ క్లాష్‍ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్‍ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్‍ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్‍ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్‍ డేట్‍ కావడంతో సెంటిమెంట్‍ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్‍ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్‍ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.

రెండు చిత్రాలు నవంబర్‍లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్‍ సూపర్‍స్టార్స్ మధ్య బాక్సాఫీస్‍ వద్ద అమీ తుమీ చూడవచ్చు.