క్రిటిక్స్ మెచ్చారు.. ఆడియన్స్ తిడుతున్నారు!

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‍ నటించిన బయోపిక్‍ ‘గుంజన్‍ సక్సేనా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక ధీరోదాత్త మహిళ కథను హృద్యంగా చెప్పారంటూ భారతదేశంలోని క్రిటిక్స్లో అత్యధికులు ఈ చిత్రానికి మంచి మార్కులు వేసారు. అయితే ఈ చిత్రానికి ‘నెపోటిజమ్‍’ సెగ తగిలింది.

ఈ చిత్రానికి నిర్మాత కరణ్‍ జోహార్‍ కావడంతో అతడిపై వున్న ద్వేషం ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్నారు. హీరోయిన్‍ శ్రీదేవి కూతురు జాన్వీ కావడంతో నెపోటిజమ్‍ వారియర్స్ మరింతగా ఈ చిత్రాన్ని టార్గెట్‍ చేస్తున్నారు. సినిమాలోని మంచి, చెడు చూడకుండా జాన్వీ ముఖంలో ఎక్స్ప్రెషన్లు పలకలేదని, కేవలం బంధుప్రీతితో ఇలాంటి టాలెంట్‍ లేని వారిని బాలీవుడ్‍ ఎంకరేజ్‍ చేస్తోందని సగటు ఆడియన్స్తో పాటు సుషాంత్‍ సింగ్‍ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎటాక్‍ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మాత్రమే కాదు ఆలియా నటించిన సడక్‍ 2 ట్రెయిలర్‍ రిలీజ్‍ అయితే ఇంతవరకు ఇండియాలో ఏ వీడియోకీ రానన్ని డిస్‍లైక్స్ దానికి వచ్చాయి. సుషాంత్‍ సింగ్‍ మరణం గురించి జనం మరచిపోయే వరకు బాలీవుడ్‍లో కొందరికి ఈ బాధ తప్పేలా లేదు పాపం.