ప్రభాస్ అయినా ఆమె మాత్రం దిగట్లేదు!

ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ కంటే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీయబోతున్న సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాడు. నాగ్ అశ్విన్ కి, నిర్మాత అశ్విని దత్ కీ ఈ సినిమా పొటెన్షియల్ ఏమిటనేది బాగా తెలుసు.

అందుకే ఈ చిత్రం బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా ఎలాంటి రాజీ వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఎలాగో ఉంటుంది కానీ, అక్కడి వాళ్లంతా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమి ఉండాలనేది నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నాడు. అందుకే హీరోయిన్ గా దీపిక పదుకోన్ అయితే బెస్ట్ అని ఆమెను అప్రోచ్ అయ్యాడు.

దీపిక మహానటి చూసి, ఆ సినిమా చూడమంటూ రికమండ్ చేయడంతోనే ఆమెను సంప్రదించారని తెలిసిపోయింది. అయితే పారితోషికం పరంగా దీపికా ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదట. ఇది హిందీతో పాటు అన్ని ప్రముఖ భాషలలో విడుదల అయ్యే సినిమా కనుక దీపికా పెద్ద అమౌంటే కోట్ చేసిందట. హీరోయిన్ కి అంత ఇస్తే బిజినెస్ పరంగా ఫీజిబుల్ ఉంటుందా లేదా అనేది అశ్విన్ తర్కించుకోవాలట.