ఆస్కార్ బరిలో ‘జైభీమ్’, ‘మరక్కార్’!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా టాప్ రేటింగ్ సంపాదించింది. ఇండియన్ సినిమా స్థాయిలో పెంచిన చిత్రాల్లో ఇదొకటి అని గర్వంగా చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు.

ఇప్పుడు ఏకంగా ‘జైభీమ్’ ఆస్కార్ 2022 అవార్డ్స్ కి బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి ఈరోజు ఆస్కార్ బరిలో నిలిచింది ‘జైభీమ్’.

తమ అభిమాన హీరో సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. టీజే జ్ఞానవేల్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు.

ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘మరక్కార్’కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడం విశేషం.