అనుష్క బ్యాక్ ఆన్ ట్రాక్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా బరువు పెరిగింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనుష్క పెట్టిన ఎఫర్ట్స్ ను ప్రేక్షకులు ప్రశంసించారు. అప్పటినుంచి తన శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడింది. పర్సనల్ ట్రైనర్ సహాయంతో బరువు తగ్గి మునుపటి అనుష్కలా మారింది. ఇప్పుడు హెల్తీ షేప్ లోనే ఉంది ఈ బ్యూటీ. దీంతో దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తరువాత అనుష్క తన వ్యక్తిగత జీవితంలో కాస్త బిజీ అవ్వడంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం.

రీసెంట్ గానే అనుష్క ఫైనల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘రారా కృష్ణయ్య’ సినిమాను రూపొందించిన దర్శకుడు మహేష్ పి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత అనుష్క చేయబోయే సినిమా ఇదే. రేపు అనుష్క పుట్టినరోజు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూద్దాం!