హీరో హీరోయిన్లు షేర్ చేసుకోక తప్పదు!

సినిమా నిర్మాణం మళ్ళీ తొందర్లోనే ట్రాక్ మీదకు రానుంది. జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందని సమాచారం. అయితే వెంటనే షూటింగ్ కి వెళ్లిపోకుండా కరోనా రహిత భారతం అయ్యే వరకు ఏమి చెయ్యాలి, అలాగే ఇన్ని రోజుల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే దానిపై కసరత్తు జరగనుంది.

ఆర్టిస్టులు, టెక్నిషియన్లు పారితోషికం తగ్గించుకోవాలనేది ఒక ప్రతిపాదన. అయితే దాంతో పాటు సెట్స్ లో జరిగే వేస్ట్ ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో ముఖ్య ఆర్టిస్ట్ కి ఒక్కో ప్రత్యేక క్యారవాన్ ఇవ్వడం ఆనవాయితీ.

కానీ ఇకపై హీరో హీరోయిన్లకి కూడా పార్టిషన్ తో కూడిన క్యారవాన్ ఇవ్వాలని, అలాగే రెండొందల మంది క్రూ పని చేసే చోట వంద మందితోనే చెయ్యాలని, దీనికి చిన్న, పెద్ద సినిమాలు అతీతం కాదని, నిర్మాతలు కొన్ని నిబంధనలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందు కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గించే మార్గాలని చూసుకుని అటుపై పారితోషికాల పరంగా ఎంత కొత్త విధించాలనేది నిర్ణయిస్తారు.