గెట్ రెడీ.. మ‌హేష్ ఫ్యాన్స్‌కి ముందుంది అస‌లు ట్రీట్‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గీత గోవిందం` ఫేమ్‌ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట క‌లిసి ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికే విడుద‌ల కావాల్సి ఉంది.

కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల మేక‌ర్స్ ఈ మూవీని వేస‌వి కానుక‌గా మే 12వ తేదీకి షిఫ్ట్ చేశారు. ఇక మొన్నీమ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర్కారు వారి పాట‌ ఫ‌స్ట్ సింగిల్ `క‌ళావతి`కి విశేష ఆద‌ర‌ణ ద‌క్కింది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఈ సాంగ్‌.. మ‌హేష్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కార‌రం.. ఈ సినిమా నుంచి అస‌లైన ట్రీట్ మ‌రికొద్ది రోజుల్లో రాబోతోంద‌ట‌. ఈ సినిమా టైటిల్ ట్రాక్ అయినటువంటి మాస్ సాంగ్‌పై త‌మ‌న్ ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాడు. దీంతో ఆ సాంగ్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు మేక‌ర్స్ ఆ మాస్ సాంగ్ ట్రీట్ కి గాను డేట్ ఫిక్స్ చేశార‌ట‌. మార్చ్ 18న ఆ సాంగ్‌ను విడుదల చేయ‌నున్నార‌ని ప్ర‌స్తుతం బ‌లంగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.