యుట్యూబ్ కు హైకోర్టు డెడ్ లైన్

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అసభ్య పోస్టుల కేసుపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపిం ది. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది.

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచ్‌ ప్రభాకర్‌ కేసుపై న్యాయవాది అశ్వినీ కుమార్‌ మెమో దాఖలు చేశారు. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియో లు అప్‌లోడ్ చేస్తున్నారని నివేదించారు. ప్రైవేట్‌ యూజర్‌ ఐడీల ద్వారా వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నట్లు వివరించారు. వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను ఆదేశించింది.

పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్‌ ప్రభాకర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని.. అరెస్టు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని చెప్పింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్‌ వేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ప్రైవేట్‌ వ్యూస్‌ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.