ప్ర‌భాస్ మూవీకి పైసా తీసుకోకుండా ప‌ని చేస్తున్న త‌మ‌న్‌..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్‌ ఒక‌టి. కె.రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కీల‌క పాత్ర‌ను పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం మార్చి 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించ‌గా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం యంగ్‌ సెన్సేషన్ తమన్‌ను రంగంలోకి దింపారు. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. రాధేశ్యామ్‌కు పైసా తీసుకోకుండా త‌మ‌న్ ప‌ని చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగానే ఆయ‌నే తెలియ‌జేశారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌మ‌న్‌…. రాధేశ్యామ్ గొప్ప ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం ఎప్పటికీ అంద‌రి మ‌న‌సుల్లో నిలిచిపోతుందని నాకు అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా స్థాయికి నేను సరిపోను. అయినా నాపై ఉన్న న‌మ్మ‌కంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు నన్ను అడిగారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నేను భావిస్తున్నాను

ఇంకా మాట్లాడుతూ.. రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రం అయిన‌ప్ప‌టికీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే, నా చేతిలో ఏ సినిమా లేక క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు యూవీ క్రియేషన్స్ మహానుభావుడు, భాగమతి అవకాశాలు ఇచ్చింది. అందుకే వారి రుణం ఇలా తీర్చుకున్నా అంటూ త‌మ‌న్ పేర్కొన్నారు. ఏదేమైనా స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్న త‌మ‌న్ ఓ పాన్ ఇండియా చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ప‌ని చేయ‌డం నిజంగా గ్రేట‌నే చెప్పాలి.