దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకడు. ఒక దశలో ఆయన ఈ విషయంలో దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నారు. బాలీవుడ్ హీరోలు కూడా ఆయన వెనుకే నిలిచారు. దేశంలో రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి కథానాయకుడు ఆయనే. ‘2.0’ సినిమాకైతే ఆయన ఏకంగా రూ.60 కోట్ల దాకా పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అలాంటి వాడు ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు 40 శాతం దాకా పారితోషకంలో కోత వేయించుకున్నట్లు సమాచారం.
‘2.0’ తర్వాత రజనీ చేసిన ‘పేట్టకు కూడా రజనీ తక్కువ పారితోషకమే తీసుకున్నాడట. సినిమా ఓవరాల్ బడ్జెట్టే తక్కువ కావడం, బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే జరగడంతో దానికి తక్కువ వర్కింగ్ డేస్ కేటాయించి.. రూ.40 కోట్లతో సరిపెట్టాడట రజనీ. ఇప్పుడు మురుగదాస్ సినిమాకు ఇంకా కొంత పారితోషకం తగ్గించుకున్నాడట. ‘2.0’ను నిర్మించిన లైకా ప్రొడక్షన్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘2.0’ వల్ల లైకా వాళ్లు నష్టపోయారు. దీంతో రజనీ రిబేట్ ఇచ్చాడట. గత దశాబ్ద కాలంలో రజనీ సినిమాల్లో హిట్టయింది ఒక్క రోబో మాత్రమే. మిగతా సినిమాలన్నీ నిర్మాతలను, బయ్యర్లను దెబ్బ తీశాయి. దీంతో రజనీ సినిమా అంటే అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రజనీ ఇప్పుడు పారితోషకం తగ్గించుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు రజనీ చేయబోయే చివరి సినిమా ఇదే అంటున్నారు.
రజనీకాంత్ పారితోషకంలో కోత
Feb 07, 2019
126 Shares
రాజకీయ వార్తలు
-
కుర్ర ఎంపీకి కష్టాలు మొదలయ్యాయా?
Feb 21,2019
126 Shares
-
రాకేష్ సంచలన దందాలు...అందుకే జయరాం మర్డర్
Feb 21,2019
126 Shares
-
అమెరికాలో దారుణం..తెలుగోడిని కాల్చి చంపారు
Feb 20,2019
126 Shares
-
చింతమనేనీ ఇది సోషల్ మీడియా కాలమబ్బా !
Feb 20,2019
126 Shares
-
ప్రమాణ స్వీకారం వేళ.. ఆమె కంట కన్నీరు!
Feb 20,2019
126 Shares
-
కాశ్మీర్పై కమల్ షాకింగ్ కామెంట్స్
Feb 19,2019
126 Shares
సినిమా వార్తలు
-
'మహానాయకుడు' ఆఖరి అస్త్రం
Feb 21,2019
126 Shares
-
మహేషా... మజాకా!
Feb 21,2019
126 Shares
-
అల్లు శిరీష్ 'గీత' గోవిందం!
Feb 21,2019
126 Shares
-
రానా కోసమా... నారా కోసమా?
Feb 21,2019
126 Shares
-
అయోమయంలో మెగా హీరో
Feb 21,2019
126 Shares
-
సూర్య నాన్న సెల్ఫీ తీసుకున్నాడహో
Feb 20,2019
126 Shares