ట్వీట్ పెట్టిన సాయి ధరమ్ తేజ్.. ఖుషీలో ఫ్యాన్స్!

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తరువాత తేజు షాక్ లోకి వెళ్లిపోవడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంలో హాస్పిటల్ వర్గాలు, మెగాఫ్యామిలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా నాగబాబు త్వరలోనే తేజ్ మన ముందుకు వస్తాడని చెప్పగా.. ‘కొండపొలం’ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ కూడా తన అన్నయ్య ఆరోగ్యంపై స్పందించాడు.

అయితే ఇప్పుడు ఏకంగా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ”నా మీద, ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి థాంక్స్ చెప్పడమనేది చాలా చిన్న పదం. త్వరలోనే మీ ముందుకొస్తా” అంటూ ట్వీట్ చేశారు ధరమ్ తేజ్. అలానే థంబ్సప్ సింబల్ చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

‘అన్నా వచ్చేశావా..? నీరాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీడియో బైట్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే ఈ మెగాహీరో నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నిజాయితీ గల సినిమా తీశారంటూ దర్శకుడ్ని, సాయి ధరమ్ తేజ్ ని పొగిడారు.