బ్యాచ్‌లర్ ప్లాన్ మార్చాడే!

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్‌‌కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.

ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్‌లర్‌‌ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్‌ని చేంజ్ చేశామని, అక్టోబర్‌‌ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.

అఖిల్, పూజ ఫ్లైట్‌లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్‌‌ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్‌ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్‌గా చేసిన ట్రైలర్‌‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. అయితే ఆ డేట్‌కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.

లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్‌కి పోటీ తప్పడం లేదన్నమాట.