ధ‌నుష్‌.. వెంకీ.. పూజా.. ఈ కాంబో ఫిక్స్


ఈ మ‌ధ్య త‌మిళ హీరోలు ఒక్కొక్క‌రుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ సూప‌ర్ స్టార్ విజ‌య్.. వంశీ పైడిప‌ల్లితో ఓ బ‌హు భాషా సినిమా చేయ‌డానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధ‌నుష్.. శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. దీని త‌ర్వాత మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడితో ధ‌నుష్ జ‌ట్టు క‌ట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ డైరెక్ట‌రే వెంకీ అట్లూరి.

తొలిప్రేమ‌తో ద‌ర్శ‌కుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్‌దె చిత్రాల‌తో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. కానీ అత‌ను చెప్పిన ఓ క‌థ న‌చ్చి ధ‌నుష్ సినిమా చేయ‌డానికి ఓకే అన్న‌ట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌.

వెంకీతో రంగ్‌దె సినిమాను నిర్మించిన‌ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్లో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ట‌. ఈ చిత్రానికి క‌థానాయిక కూడా ఖ‌రారైన‌ట్లు తాజా స‌మాచారం. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న పూజా హెగ్డే ఈ చిత్రానికి క‌థానాయిక‌గా ఓకే చేశార‌ట‌. ధ‌నుష్‌తో పూజా చేయ‌నున్న తొలి చిత్ర‌మిదే. ఈ చిత్రం విద్యా వ్య‌వ‌స్థను బాగు చేయ‌డానికి త‌పించే ఓ కుర్రాడి క‌థ‌తో తెర‌కెక్క‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. కాన్సెప్ట్ ఇండియాలో అంద‌రూ రిలేట్ చేసుకునేలా ఉంటుంద‌ని.. అందుకే ధ‌నుష్ ఈ చిత్రం చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ని స‌మాచారం.

ఐతే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చు. ధ‌నుష్ త‌మిళంలో మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి చేసి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా కూడా చేశాక ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించే అవ‌కాశ‌ముంది.