మెహ్రీన్‌ నుంచి విడిపోవడంపై అతనేమన్నాడంటే..

Mehreen

కొన్నేళ్ల కిందట సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష.. వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకోవడం.. కొంత కాలం అతడితో కలిసున్నాక ఉన్నట్లుండి నిశ్చితార్థం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. నిశ్చితార్థం రద్దయ్యాక త్రిష పేరెత్తకుండా ఆమెనుద్దేశించి నెగెటివ్ కామెంట్లు చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ఇదే తరహాలో సౌత్‌లో ఫేమస్ అయిన మరో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. పొలిటీషియన్ అయిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని.. కొన్ని నెలలకే దాన్ని రద్దు చేసుకుంది. వీళ్ల మధ్య తీవ్ర విభేదాలే వచ్చాయని.. అందుకే విడిపోయారని అంటున్నారు. తాజాగా మెహ్రీన్ పెట్టిన ఒక పోస్టు భవ్యను ఉద్దేశించే అని భావిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తే భవ్య, అతడి కుటుంబం ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మెహ్రీన్‌తో నిశ్చితార్థం రద్దవడంపై భవ్య కూడా స్పందించాడు. ఆమెను తానెంతో ప్రేమించానని.. కానీ తామిద్దరం కలిసి సాగలేకపోయామని అతనన్నాడు. మెహ్రీన్‌ నుంచి విడిపోవడం పట్ల తానేమీ చింతించట్లేదని అతను వ్యాఖ్యానించడం గమనార్హం.

“మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జులై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని భావించాను. కానీ కాలం మా జీవితాలను వేరు చేసింది. మెహ్రీన్‌ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు. నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను” అని భవ్య పేర్కొన్నాడు. మెహ్రీన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను తాను ఎప్పుడూ ఉన్నతంగానే చూశానని భవ్య అన్నాడు.