ఎన్టీఆర్ అభిమానులు వదిలిపెడతారా?

తమ ఆరాధ్య కథానాయకులను ఎవరైనా ఏమైనా అంటే, తక్కువ చేసి మాట్లాడితే అభిమానులు తట్టుకోలేరు. అందులోనూ ఇది సోషల్ మీడియా కాలం ఆయె. అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని దారుణంగా ట్రోల్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను గతంలో బాలీవుడ్ భామ మీరా చోప్రా ఇలాగే హర్ట్ చేసింది.

ఆమె ట్విట్టర్లో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తుంటే.. ఒక నెటిజన్ ఎన్టీఆర్ గురించి చెప్పమని అడగడం, అందుకామె అతనెవరు అని ప్రశ్నించడం.. తర్వాత ఎన్టీఆర్ అభిమానుల వేలకొద్దీ వచ్చి ఆమెను ట్రోల్ చేయడం.. మీరా వాళ్లపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఇష్యూ సీరియస్ అయిపోవడం.. ఇదో పెద్ద వివాదంగా మారడం తెలిసిందే. ఆ వ్యవహారంలో చివరికి మీరాదే పైచేయి అయింది. ఎన్టీఆర్ అభిమానులు తగ్గాల్సి వచ్చింది. ఐతే మీరా మళ్లీ ఎప్పుడు దొరుకుతుందా అని అప్పట్నుంచి ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్.

ఇప్పుడు మీరా చోప్రా ఒక వివాదంతో వార్తల్లో నిలిచిింది. ఆమె వ్యాక్సినేషన్ చేయించుకోవడం కోసం హెల్త్ వర్కర్ లాగా ఫేక్ ఐడీ క్రియేుట్ చేసిందని.. దాని ద్వారానే మిగతా సెలబ్రెటీల కంటే ముందు టీకా వేయించుకుందని ఆరోపణలు వస్తున్నాయి. మీరా ఫొటోతో ఉన్న ఫేక్ ఐడీ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక అంతే నెటిజన్లు ఆమెను గట్టిగా తగులుకున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్లు ఎన్టీఆర్ అభిమానులు కూడా రంగంలోకి దిగిపోయారు. ఒకప్పటి వివాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మీరాను దారుణంగా ట్రోల్ చేశారు.

ఐతే ఈ విషయమై మీరా కొంచెం ఆలస్యంగా స్పందించింది. తాను కష్టపడి నెల రోజులు ప్రయత్నిస్తే చివరికి టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగానని, ఆ ప్రకారమే తాను టీకా వేయించుకున్నానని.. అంతే తప్ప ఫేక్ ఐడీ క్రియేట్ చేశానన్నది అబద్ధమని స్పష్టం చేసింది. ఆ ఐడీలో తన సిగ్నేచర్ కూడా లేదని, అలాంటపుడు ఆ ఐడీ తాను క్రియేట్ చేసినట్లు ఎలా భావిస్తారని ఆమె ప్రశ్నించింది. ఐతే ఇందులో ఏది నిజమో ఏమో కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒక రోజంతా మీరాను ట్రోల్ చేసి కాస్త ఉపశమనం పొందారు.