భ‌విష్య‌త్‌లోకి వెళ్ల‌బోతున్న‌ ప్ర‌భాస్

రాధేశ్యామ్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మూడు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఈ మూడింట్లో చాలా కొత్త‌గా ఉంటుంద‌నే ఆశ రేకెత్తిస్తున్న సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయేదే. మ‌హాన‌టితో ఔరా అనిపించిన నాగ్ అశ్విన్ ప్ర‌భాస్‌తో ఒక వినూత్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌నే సంకేతాలు ముందు నుంచి అందుతున్నాయి.

ఇది ఆదిత్య 369 సినిమాకు మోడ‌ర్న్ వెర్ష‌న్ అనే ప్ర‌చారం ఎప్ప‌ట్నుంచో న‌డుస్తున్నాయి. అందులో మాదిరి ఫాంట‌సీ ట‌చ్ ఉంటుందో లేదో క‌చ్చితంగా చెప్ప‌లేం కానీ.. ఇదొక సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అనేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ముందు నుంచి ఈ దిశ‌గా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. ఆదిత్య 369 ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఈ చిత్రానికి మెంటార్‌తో పెట్టుకోవ‌డం కూడా ఈ ప్ర‌చారానికి ఊపునిస్తున్న‌దే.

తాజాగా ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌ను ఛాయాగ్రాహ‌కుడిగా, మిక్కీ జే మేయ‌ర్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశారు. మ‌హాన‌టిలో అద్భుత ప‌నిత‌నం చూపిన వీళ్లిద్ద‌రినీ ప్ర‌భాస్‌తో చేయ‌బోయే భారీ చిత్రానికి కూడా ఎంచుకున్నాడు అశ్విన్. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ అత‌ను చేసిన కామెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌హాన‌టితో గ‌తం తాలూకు క‌థ‌ను వెండితెర‌పైకి తెచ్చామ‌ని.. ఈసారి భ‌విష్య‌త్తులోకి ప్ర‌యాణించ‌బోతున్నామ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు.

దీన్ని బ‌ట్టి ప్ర‌భాస్‌తో అత‌ను చేయ‌బోయేది సైంటిఫిక్ థ్రిల్ల‌రే అని.. ఆదిత్య 369లో మాదిరే ఇందులోనూ భ‌విష్య‌త్‌లోకి ప్ర‌యాణం ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలాంటి క‌థ‌లో ప్ర‌భాస్ న‌టించ‌డం అన్న‌ది ఎంతో ఎగ్జైట్ చేసే విష‌య‌మే. మ‌రి యంగ్ రెబ‌ల్ స్టార్‌ను అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే క‌థానాయిక కాగా.. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర చేయ‌నున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.