ప్రభాస్ పై కేసుపెట్టిన తెలంగాణ అధికారి !

ప్రముఖ నటుడు ప్రభాస్ పై తెలంగాణ రెవెన్యూ అధికారి కేసు పెట్టారు. కేసు ఏంటో తెలుసా? ప్రభాస్ తన గెస్టు హౌస్ లోకి తాను వెళ్లినందుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ కేసు పెట్టారు. అదేంటి ప్రభాస్ తన గెస్ట్ హౌస్ తాను వాడితే కేసు పెట్టడం ఏంటి? అనుకుంటున్నారా… ఇక్కడో ట్విస్ట్ ఉంది.

2200 గజాల్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ప్రభాస్ దే కానీ అది నిర్మించిన స్థలం మాత్రం వివాదంలో ఉంది. రాయదుర్గం పరిధిలోని 46వ సర్వే నెంబరులో 84 ఎకరాల 30 గుంటల భూమిపై నలభై సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబరులో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అదేంటి 40 ఏళ్ల నుంచి వివాదం నడుస్తుంటే… ఇటీవల ఆయనలా అక్కడకు పోయి కట్టుకున్నాడనేది మరో సమస్య.

సీజ్ చేసిన గెస్ట్ హౌస్ లోకి లాక్ డౌన్ సమయంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రభాస్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చాలారోజుల క్రితమే గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి అది ప్రభుత్వం స్థలం అన్నది రెవెన్యూ అధికారుల వాదన. దీనిని ఆల్రెడీ నోటిఫై కూడా చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గతంలోనే ప్రభాస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదింకా పెండింగ్ లో ఉంది. ఈ కేసు ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టు మెట్లెక్కింది.