నితిన్‍ మెగా ప్లాన్‍కి పూజ హెగ్డే బ్రేక్‍

నితిన్‍ తన ప్రతి సినిమాలోను టాప్‍ హీరోయిన్‍ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్‍హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్‍ హీరోయిన్‍ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్‍ తదుపరి చిత్రం ‘రంగ్‍ దే’లో కూడా కీర్తి సురేష్‍ హీరోయిన్‍. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్‍ చిత్రమిదే.

అంధాధూన్‍ రీమేక్‍ నిర్మించనున్న నితిన్‍ అందులో కూడా ఎవరైనా టాప్‍ హీరోయిన్‍ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్‍ వున్న హీరోయిన్‍ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్‍లో టబు చేసిన క్యారెక్టర్‍కి నయనతారను అప్రోచ్‍ అయ్యాడని సమాచారం.

ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్‍గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్‍ని నితిన్‍ చాలా గ్రాండ్‍గా ప్లాన్‍ చేస్తున్నాడు. బడ్జెట్‍ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్‍ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్‍ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్‍పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్‍ అయితే కానీ తెలీదు.