డెల్టా ప్లస్ వేరియంట్.. ముంబయిలో తొలి మరణం..!

దేశంలో డెల్టా ప్లస్ వేరింయట్ విజృంభణ మొదలైందని అర్థమౌతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మొదలౌతున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా.. తాజాగా తొలి మరణం నమోదైంది. ముంబయిలో ఈ మరణం నమోదు కావడం గమనార్హం.

ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా.. వైరస్‌ సోకిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకి.. ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడిందని వైద్యులు వెల్లడించారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.ఆ మహిళ కుటుంబంలోని ఆరుగురు కూడా కరోనా మహమ్మారి బారీన పడ్డారని తెలిపారు. ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరి కి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు.

సదరు మహిళ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. ఆమె వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. ప్రాణాలు కోల్పోయిందనే విషయం ఇతరులను భయపెడుతోంది. ఈ క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.