చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుందబ్బా

Chiranjeevi Fans

చిరంజీవి ఆచార్య షూటింగ్‍ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, దేనిని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుంది. ఆచార్య ముందుగా వచ్చే వేసవిలో విడుదలవుతుంది. ఏప్రిల్‍ నెలాఖరులో లేదా మే రెండవ వారంలో ఈ చిత్రం రిలీజ్‍ కావడం పక్కా. షూటింగ్‍ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ అప్పటికి రిలీజ్‍ అయ్యేలా చిరు వర్క్ చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వేదళాం షూటింగ్‍ ముందుగా స్టార్ట్ అవుతుంది.

అది కొన్నాళ్ల పాటు షూటింగ్‍ జరుపుకున్న తర్వాత లూసిఫర్‍ రీమేక్‍ కూడా మొదలు పెడతారు. వేదళాం రీమేక్‍ దసరా సీజన్లో విడుదలయ్యేలా, ఆ తర్వాత లూసిఫర్‍ 2022 సంక్రాంతికి వచ్చేలా చిరంజీవి పక్కాగా ప్లాన్‍ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత అస్సలు టైమ్‍ వేస్ట్ కాకుండా వేదళాం, లూసిఫర్‍ కోసం ప్రీ ప్రొడక్షన్‍ ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. ఆ రెండు సినిమాలలోను చిరంజీవి ఇంచుమించు ఒకే తరహా లుక్‍తో కనిపిస్తారు. వేదళాం కోసం వేసే మరో గెటప్‍కి సంబంధించిన షూట్‍ ఆచార్య అయిన వెంటనే పూర్తి చేస్తారు. నెక్స్ట్ లుక్‍కి మారిన తర్వాత లూసిఫర్‍ షూటింగ్‍ కూడా ప్యారలల్‍గా చేస్తారు.