కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఈ సినిమాల కోసం అమ్మడుకి కోటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ సినిమాకి అయితే అటు ఇటుగా రూ.80 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోన్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘కబీర్ సింగ్’ సినిమాతో కియారా రేంజ్ మారిపోయింది.

ఇప్పుడు ఆమె బాలీవుడ్ రూ.4 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగులో నటించడానికి కూడా అదే రేంజ్ లో అడుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో కియారా అద్వానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఫైనల్ గా నాలుగున్నర కోట్లకు ఒప్పించారట.

హీరోయిన్ రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక హీరో, డైరెక్టర్ లకు ఎంతిస్తున్నారో మరి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన బ్యానర్ లో వస్తోన్న యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!