చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన మంత్రి పువ్వాడ.. మ్యాటరేంటి?

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం.

ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్ ని పువ్వాడ ఎందుకు కలిశారా అనే అనుమానాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే.. దానికి రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తన ట్వీట్ చూస్తే అర్థమౌతోంది.

మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ తో తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఉన్నారు.

కాగా.. పువ్వాడ తన కుమారుడు నయన్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికోసమే.. వీరిద్దరినీ కలిసారంటూ పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మంత్రి పువ్వాడ కుమారుడు నయన్.. ఈ ఇద్దరి నటులకు అభిమాని అయ్యి ఉండచ్చని.. అందుకే కలిశారు కాబోలు అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ఇప్పుడిలా వారిని కలవడం.. హాట్ టాపిక్ గా మారగా.. ఫోటోలు వైరల్ గా మారాయి.