చిరుని లాక్ చేసిన బాలయ్య.. శరవేగంగా షూటింగ్

మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో రానున్న సంక్రాంతి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతి పోటీ లో నిలిచిన ఈ సినిమాకు ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. చిరు -రవితేజ మీద కూడా చాలా సీన్స్ పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయట. ఒక యూనిట్ ను ‘పంతం’ దర్శకుడు చక్రవర్తి హ్యాండిల్ చేస్తున్నాడని సమాచారం. మరో యూనిట్ తో బాబీ కొన్ని సీన్స్ తీస్తున్నాడని తెలుస్తుంది.

వాల్తేరు వీరయ్య ని సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా జనవరిలో రావడం కష్టమే అని మొన్నటి వరకూ మేకర్స్ కి డౌట్ ఉండింది. కానీ ఎప్పుడైతే బాలయ్య సినిమా కూడా సంక్రాంతి కి ఫిక్స్ అయ్యిందో అప్పటి నుండి పోటీ మొదలైంది. ఇక వీరయ్య వెనక్కి తగ్గితే ఫ్యాన్స్ ఒప్పుకోరు కనుక లాక్ చేసుకున్న సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారు. పైగా ఇటు బాలయ్య అటు చిరు రెండు సినిమాలకు మైత్రి నే నిర్మాణం కావడంతో ఈసారి ఒకే బేనర్ నుండి వస్తున్న రెండు బడా సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. రెండూ మాస్ కమర్షియల్ సినిమాలే కావడంతో ఈసారి చిరు , బాలయ్య మధ్య టఫ్ వార్ జరగనుంది. మరి సంక్రాంతి పోటీలో వీరుడుగా నిలిచే ‘వీర’ ఎవరో వేచి చూడాల్సిందే.