కథ కార్తీక్‌ది.. డైరెక్షన్‌ శంకర్‌‌ది

‘ఆర్‌‌ఆర్ఆర్‌‌’ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టలేదు రామ్ చరణ్. ఆ సినిమా చివరి దశకు వచ్చాక శంకర్‌‌తో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఆ సిమూవీ షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. తన ఒరిజినల్ శైలికి భిన్నంగా కాస్త వేగంగానే ఈ ప్రాజెక్టును లాగిస్తున్నాడు శంకర్.      కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా.

ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్‌‌గా చరణ్ నటిస్తున్నాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. అది నిజమో కాదో తెలీదు కానీ.. ఈ సినిమా కథ  మాత్రం శంకర్‌‌ది కాదని తేలింది. ఈ మూవీకి స్టోరీ అందించింది మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.     

లాక్‌ డౌన్‌ టైమ్‌లో శంకర్‌‌ చాలామంది దర్శకులతో మాట్లాడాడట. వారిలో కార్తీక్ కూడా ఉన్నాడు. నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్‌ని శంకర్‌‌ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్‌‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్‌‌ తీస్తున్నది అదే కథ.     

ఈ విషయాలన్నీ రీసెంట్‌ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్‌‌ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో  అందరికీ తెలుసు. అతని మాస్‌ కథకి శంకర్‌‌ క్లాస్‌ టేకింగ్‌ కలిస్తే ఎలా తయారవుతుందో చూడాలి మరి.